పాల్వంచ/భద్రాద్రి కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పాల్వంచలో టీ జాక్ ఆధ్వర్యంలో KTPS 5&6 దశల చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేష్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చాట్ల శ్రీనివాసరావు, ఎండీ సమీర్, ఆధ్వర్యంలో ఈ ధర్నా కొనసాగింది.
ఈ సందర్భంగా టీ జాక్ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ amidment బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి ఉద్యోగులను అలాగే రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే దశలవారీ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో TRVKS నాయకులు సాదం రామ కృష్ణ రావు, రాంబాబు, శ్రీనివాస్, జాల కరుణాకర్ రెడ్డి ఎస్కే సాధిక్ పాషా, కట్టా మల్లికార్జున్, కాలే కాంతయ్య, KTPS 7 వ దశ రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు తోట కోటేశ్వరరావు, ముత్యాల రాంబాబు రీజనల్ ట్రెజరర్ అచ్చ కోటిలింగం 5&6 రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు కె. రవి కుమార్, ఎం రమేష్, నాయకులు తోట అనిల్, ఖాన్, ఖమ్మం శీను, పద్మాకర్ ఎండీ అమీన్, రహీమ్, కాలువ రవి కుమార్ యాదవ్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసొసియేషన్ రాష్ట్ర నాయకులు సమీర్, నారాయణ, రామకృష్ణ జాదవ్, మురళీ కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.