అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పరిస్థితిని చూస్తుంటే జాలేస్తుందని రాజంపేట వైసీపీ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ మిథున్రెడ్డి (MP Mithun Reddy) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన షర్మిల తన రాజకీయం కోసం వైఎస్ జగనన్న పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కు మద్దతు ఇస్తున్నట్లుగానే షర్మిల మాట్లాడుతుందని విమర్శించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో పెట్టిన, వైఎస్ జగన్ను 16 నెలల పాటు జైల్లో పెట్టిన కాంగ్రెస్ను దూషించిన షర్మిల నేడు అదే పార్టీకి చీఫ్గా కొనసాగడం జాలేస్తుందని అన్నారు. ఇప్పటికీ జగన్ చెల్లెలుగా షర్మిలపై తమకు అపార గౌరవం ఉందని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను సైతం ముఖ్యమంత్రి నెరవేర్చారని తెలిపారు.