హైదరాబాద్: వైఎస్ వివేకా హత్యకేసు (YS Viveka Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్మెన్లను నియమించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ప్లస్ గన్మెన్లను పోలీసు శాఖ కేటాయించింది.
మరోవైపు ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి బెయిల్ ఇవ్వరాదంటూ, వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.