హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీని (YSRTP) హస్తంపార్టీలో విలీనం చేస్తారు. ఇప్పటికే ఆమె తన భర్త అనిల్తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
కాగా, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తారని తెలుస్తున్నది. ఏపీలో త్వరలో అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమెకు పీసీసీ చీఫ్గా నియమిస్తారని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.