అమరావతి : ఏపీలోని తిరుపతి (Tirupati ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో (RTC Bus ) ఉరేసుకుని మృతి చెందాడు. శ్రీకాళహస్తి- తిరుపతి మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో ఆదివారం తెల్లవారుజామున ఘటన జరిగింది. రేణిగుంట వద్ద బస్సులో వెనుక సీటు వద్ద ఉన్న హ్యాంగర్కు (Hanger) యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కండక్టర్ గుర్తించారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని, యువకుడి వివరాలు సేకరిస్తున్నారు .