అమరావతి : ప్రియురాలు మోసం చేసిందంటూ ఓ యువకుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందని కోప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటోందని యువకుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు.
యువతితో కలిసి ఉన్న ఫోటోలను సదరు యువకుడు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.