అమరావతి : (Srikanth Reddy) కర్నూలు జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని ప్రజా విజయంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తమది ప్రజలను నమ్ముకున్న పార్టీ అని చెప్పారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. సీఎం జగన్ నాయకత్వానికి, వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బద్వేల్లో బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ.. కథ నడిపించింది మొత్తం చంద్రబాబే అని దుయ్యబట్టారు. ప్యాకేజీ పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
సీఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేపట్టి సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెవెళ్లి ఓట్లు అడగ్గలిగామని శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు హితవుపలికారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలను బీజేపీ నెరవేర్చలేనందున ప్రజలు ఆ పార్టీకి సరైన గుణపాఠం చెప్పారన్నారు. జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడైనందుకే ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. బహిరంగసభలో పవన్ కల్యాన్ ఇష్టానుసారం మాట్లాడటాన్ని గడికోట శ్రీకాంత్రెడ్డి తప్పుపట్టారు. పవన్ మాటల్లో క్లారిటీ లేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పడం వెనక ఆయన ఉద్దేశం ఏమిటి? స్పష్టం చేయాలన్నారు.
చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టడమా? మంత్రి కొడాలి నాని ఫైర్
ప్రభుత్వ దవాఖానల్లో డ్రస్ కోడ్.. మండిపడుతున్న వైద్యులు
అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి: ఉపరాష్ట్రపతి
టీడీపీ గుర్తింపును రద్దు చేయండి : వైసీపీ
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..