విశాఖపట్టణం : (Venkaiah Naidu) ప్రజలందరికీ న్యాయాన్ని అందుబాటులోకి, ఆర్థిక భారం కాకుండా చొరవ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కేసుల విచారణలో జాప్యాన్ని తగ్గించడం తక్షణావసరమని ఆయన సూచించారు. మంగళవారం విశాఖపట్టణంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘స్వాతంత్రోద్యమ స్ఫూర్తి : ముందడుగు’ థీమ్తో నిర్వహించిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో న్యాయ వ్యవస్థలో సానుకూలమైన మార్పులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా.. భవిష్యత్ న్యాయవాదులైన న్యాయ విద్యార్థులను మార్పునకు సారథులుగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు.
స్వాతంత్ర్యానంతరం వివిధ రంగల్లో సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. గత వైభవాన్ని తలచుకుంటూ వర్తమానంలో ఉండిపోకూడదని, మరింత భవ్యమైన భవిష్యత్ను రచించుకునేందుకు పేదరికం, లింగవివక్షత, నిరక్షరాస్యత, కులవివక్ష, అవినీతిని నిర్మూలించేందుకు జాతీయవ్యాప్త ప్రజా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉన్నదని ఆకాంక్షించారు. బలమైన, భద్రమైన, సుభిక్షమైన, ఆరోగ్యకరమైన, ఆనందరకమైన భారతదేశ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, విశ్వవిద్యాలయం వైస్ఛాన్స్లర్ ప్రొఫెసర్ సూర్యప్రకాష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మధుసూదనరావు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
టీడీపీ గుర్తింపును రద్దు చేయండి : వైసీపీ
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
వ్యక్తి హింసిస్తున్న కుక్కను కాపాడిన ఆవు! వీడియో వైరల్
15 వేల కోట్ల బైక్ బాట్ కుంభకోణం బట్టబయలు
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్లు కొట్టాడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..