న్యూఢిల్లీ : (YCP @ President) ముఖ్యమంత్రి జగన్పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రిని అసభ్యకరమైన పదజాలంతో దూషించాలని తన పార్టీ నేతలను పురమాయిస్తూ చంద్రబాబు.. మరోవైపు రాష్ట్రపతిని కలిసి వైసీపీపై ఫిర్యాదు చేయడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై అప్రజాస్వామిక రీతిలో దాడులకు పాల్పడుతున్న టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు.
రాష్ట్రపతి కోవింద్తో భేటీ అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఏడాదిన్నరగా ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయిన చంద్రబాబు టెర్రరిస్ట్ మాదిరిగా మారడం, ఆయన నేతృత్వంలో నడుస్తున్న పార్టీ నేతలతో మాట్లాడిస్తున్న అసభ్యకరమైన బూతులు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రపతికి వివరించి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరామని ఆయన తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పులను రాష్ట్రపతికి తెలియజేశామని, ఆయన ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడో రాష్ట్రపతికి వివరించినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రం పరువు, ప్రతిష్ఠలను దిగజార్చేలా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే విధంగా చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటన చేపట్టారన్నారు. జగన్పై టీడీపీ నేత వాడిన పదాన్ని రాష్ట్రపతికి వివరించగా, ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు.
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
వ్యక్తి హింసిస్తున్న కుక్కను కాపాడిన ఆవు! వీడియో వైరల్
15 వేల కోట్ల బైక్ బాట్ కుంభకోణం బట్టబయలు
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్లు కొట్టాడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..