అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల ముంగిట వద్దకు వెళ్లి సంక్షేమ పాలన అందించం వల్లే 2 శాతం ఓటింగ్ పెరిగిందని, ఇది వైసీపీకి అనుకూలమని అన్నారు. జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా రెండోసారి వైఎస్ జగన్ (YS Jagan) ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వెల్లడించారు.
వాలంటీర్ వ్యవస్థ (Volunteer System) తో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, ఇతర రాష్ట్రాలు సైతం వాలంటర్ వ్యవస్థను అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అవినీతి, మద్యవర్తిత్వం లేకుండా అందించామని అన్నారు. జగన్ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
కూటమి నేతలు ఎక్కువగా పోటీ చేసిన నాలుగు జిల్లాల్లోనే ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేశారని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో కొంతమంది మీద దాడి జరిగితే దానికి రాజకీయ రంగు దిద్దారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశాంతవాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. వైఎస్ జగన్ విదేశాలకు చెప్పేసి వెళ్లారని, చంద్రబాబు, ఆయన కుమారుడు చెప్పకుండానే విదేశాలకు వెళ్లిపోయారని దుయ్యబట్టారు.