హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫాను (YSRCP) గాలి జోరుగా వీస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇలాఖాలో అధికార పార్టీ పాగావేసింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలు ఉండగా, ఒక సీటు ఏకగ్రీవం అయింది. మిగిలిన 24 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు ఫలితాలు వెలువడిన వాటిలో వైసీపీ 14 స్థానాలను సొంతం చేసుకోగా, టీడీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకున్నది.
ఇక అనంతపురం జిల్లాలోని పెనుగొండ మున్సిపాలిటీలో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. పెనుగొండలో 20 స్థానాలకు గాను వైసీపీ 18 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ ఖాతా తెరవలేదు. అదేవిధంగా ఎనిమిది నగరపంచాయతీల్లో అధికారపార్టీ గెలుపొందింది.