అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచుకోవడానికే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఆరోపించారు. మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. టీడీపీ(TDP) అధికారంలోకి వస్తే దోచిన డబ్బంతా కక్కించే బాధ్యత తీసుకుంటామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు(YCP MLAs) ప్రజాద్రోహులుగా మారారని, అందుకు కారణమైన సైకో పాలనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదని, ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, 14 ఏండ్ల ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా తప్పుడు పనిచేయలేదని తెలిపారు.
ఏపీ (AP) లో లాంటి రాజకీయాలు ఎన్నడూ చూడలేదని అన్నారు. వైసీపీ తీసుకొస్తున్న కొత్త చట్టం వల్ల భూములున్న ప్రతి వ్యక్తి ఇబ్బందులు పడుతారని అన్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.