అమరావతి : గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్డెర కాలనీలకు చెందిన 14 మంది మహిళా కూలీలు తుమ్మలపాలెంలో పత్తితీతకు ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో గాయపడ్డ తొమ్మిదిమందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బేగం(52), షేక్దరియా (55) చికిత్సపొందుతూ మృతి చెందారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు.