అమరావతి : ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. యువకుడి మర్మాంగాలపై యువతి తండ్రి దాడి చేసి గాయపరిచాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని చట్రాయి మండలం నరసింహారావు పాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది . గ్రామంలోని ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి యువకుడిని ఇంటికి పిలిచి చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
తన కూతురు వెంటపడుతున్నాడనే కోపంతో యువకుడు మర్మాంగాలపై రోకలి బండతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు వివరించారు.