Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి చైర్మన్ కె. రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక వేదపండితులు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్నారు. వారికి శ్రీశైల దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక వేదపండితులు పట్టు వస్ర్తాలను తలపై ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు సమర్పించుకున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు.