హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో ఏపీలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆలమూరు రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా జోనల్ ఇంచార్జి నాగుల్ మీరా, షేక్ రబ్బాని సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించే బీజేపీని దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పా రు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురొనే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు. టీడీపీ, వైసీపీ మోసపూరిత వాగ్దానాలతో ఏపీ ప్రజలు వంచనకు గురయ్యారని, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించిందన్నారు.