అమరావతి : విద్యుత్ పరికరాల కొనుగోలుకు వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన పల్నాడుజిల్లాలో చోటు చేసుకుంది. సత్తెనపల్లి – గుంటూరు ప్రధాన రహదారి కంటేపూడి నలంద కళాశాల వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న పేరేచర్ల, క్రోసూరు మండలాలకు చెందిన అజయ్, మున్నా మృతి చెందారు. పేరేచర్లలో విద్యుత్ సామాగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.