తిరుపతి : తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలోకి మరో రెండు ఆలయాలు(Temples) కొత్తగా వచ్చి చేరాయి. చిత్తూరు జిల్లా(Chittoor District) చౌడేపల్లి మండలం వెంగలపల్లి గ్రామంలోని రాజనాలబండ ప్రసన్న ఆంజనేయస్వామి (Anjaneya swamy), లక్ష్మీనరసింహస్వామి(Laxmi narasimha swamy) ఆలయాలను టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది.
ఈ మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం ఆలయ పత్రాలను టీటీడీ డిప్యూటీ ఈవో శాంతికి అందజేశారు. ఈ ఆలయాన్ని పుంగనూరు గ్రూపు ఆలయాల పరిధిలోకి తీసుకున్నామని ఆలయ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్, సీఏవో వెంకటరమణ, ఏఈవోలు మునికృష్ణారెడ్డి, శ్రీ మణి, తహసీల్దార్ లలిత, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.