అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని రాయచోటి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితులిద్దరు పాత సామానుల వ్యాపారం చేస్తున్నారని వెల్లడించారు. కాల్పులకు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.