Ireland | ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి సాయిబాబా అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్నాడు. ప్యూరిఫైడ్ వాటర్ పరికరాల బిజినెస్ చేస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు భార్గవ్ (25)ను ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం ఐర్లాండ్కు పంపించారు. అక్కడ కార్లోలోలని సౌత్ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. అలాగే పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన చెరుకూరి రామకోటయ్య పెద్దకుమారుడు సురేశ్ (26) ఉన్నత చదువుల కోసం ఏడాది కిందట ఐర్లాండ్కు వెళ్లారు. వీరిద్దరూ అక్కడే ఇద్దరు స్నేహితులయ్యారు.
ఈ క్రమంలోనే శుక్రవారం (జనవరి 31) రాత్రి వీరిద్దరూ మరికొంతమంది స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ఆ సమయంలో భారీగా మంచు కురవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారుతో సహా వారు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో భార్గవ్, సురేశ్ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.