(Roja coments) అమరావతి : టీడీపీ నాయకులు చంద్రబాబాబు, లోకేష్లపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రమైన కామెంట్స్ చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని చిత్తుచిత్తుగా ఓడించినా వారికి సిగ్గు రాలేదని, కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై లోకేష్ చేసిక విమర్శలపై రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.
‘పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తుంగలో తొక్కారు. మున్సిపల్ ఎన్నికల్లో మురుగు కాలువల్లో ముంచి తీశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తరిమి కొట్టారు. అయినా వారికి సిగ్గు రాలేదు’ అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో లోకేష్ మాటలు, సవాళ్లు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయని, కుప్పంలోనూ చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసేందుకే ఆయన కొడుకు ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని వ్యాఖ్యానించారు. ఏనాడు కుప్పం ప్రజలకు చంద్రబాబు అందుబాటులో లేరన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సీఎం జగన్.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలనను చేరవేశారని ప్రశంసించారు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని ఆటలాడినా కుప్పం ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదని, ఈ ఎన్నికల తర్వాత రాసుకోవడానికి చరిత్ర.. చూసుకోవడానికి భవిష్యత్ ఉండదని రోజా జోస్యం చెప్పారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..