అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 35,642 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 11,178 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా రూ. 2. 77కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని వివరించారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు మైక్ల ద్వారా భక్తులకు వివరిస్తున్నారు.
ఈరోజు సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, కల్యాణమండపంలో ఆస్థానం నిర్వహించి తిరిగి ఆలయానికి చేరుస్తామని అర్చకులు పేర్కొన్నారు.