తిరుమల: తిరుమల (TTD) శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తన భక్తిన ఒక భక్తుడు చాటుకున్నారు. శ్రీవారికి సుమారు రూ. 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను విరాళంగా అందించారు. శుక్రవారం నాడు ఆలయానికి వచ్చిన ఆయన.. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలనుటిటిడి అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.