అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసింది . అనంతపురం జేసీ నిశాంత్ కుమార్ను గుంటూరు మున్సిపల్ కమిషనర్గా నియమించింది . రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ను అనంతపురం జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .