హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్లమార్గంలో చిరుత సంచరించినట్టు భక్తులు చెబుతున్నారు.
పులివెందులకు చెందిన భక్తులు మెట్లమార్గం వైపుగా వెళ్తుండగా.. చిరుత వేగంగా రోడ్డు దాటిందని చెప్పారు. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలినడకన భక్తులను గుంపులు, గుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్హౌజ్ దగ్గర భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు.