తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. నిన్న స్వామివారిని 65,514 మంది భక్తులు దర్శించుకోగా 20,394 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.