పిడుగురాళ్ల: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో సమీప బంధువులే వారిని విచక్షణా రహితంగా కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేశ్గా గుర్తించారు.
కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో సాంబశివరావు కోడలు మాధురి, నిందితులు లొంగిపోయారని వెల్లడించారు.