Road Accident | ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. గాయపడ్డ మరొకరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. అయితే, కొవ్వూరు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి.. పక్క వైపు నుంచి వెళ్తున్న మెడికల్ వ్యాన్, కంటైర్ను ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.