గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో (Andhra pradesh) పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్ఎస్ (BRS) మరో ముందడుగు వేసింది. గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ హాళ్లు, నాయకులకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.