తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా రూ. 2. 13 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. క్యూలైన్లలో భౌతికదూరం పాటించాలని సూచించారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు టీటీడీ బోర్డు అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు .