తిరుమల :తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈరోజు నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయంలో ఆధ్యయనోత్సవాలు ఈ నెల26వ తేదీ వరకు జరుగుతున్నందున స్వామివారి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. కాగా రోజురోజుకూ కరోనా కేసులు పెరగడంతో టీటీడీ అధికారులు పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు.