అమరావతి : ఏపీలో సార్వత్రిక ఎన్నికల (Elections) సమరంలో మొదటి ఘట్టం నామినేషన్ల (Nominations ) ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 175 అసెంబ్లీ (Assembly) , 25 పార్లమెంట్ ( Parliament) స్థానాలకు ఎన్నికలు జరుగనున్న సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి సమీప ప్రాంతాల్లో భారీ బందోబస్తును నెలకొల్పారు.
ఈనెల 25 వరకు కొనసాగే నామినేషన్ల ప్రక్రియ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలిరోజు నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) గురువారం కలెక్టర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivas reddy) నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు .