తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా పిలువబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమలలోని 27 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 75,227 మంది దర్శించుకోగా 33,706 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.85 కోట్లు వచ్చిందని వివరించారు.
ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.
కళాశాలలో జూలై 10వ తేదీ వరకు దరఖాస్తులు పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 15వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో అందజేయాలని సూచించారు. 4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులో చేర దలచిన విద్యార్థులు కోర్సుల విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్సైట్ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637, 9866997290 నంబరులో గానీ కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు.