తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పక్కన ఉన్న లడ్డూ కౌంటర్ల వద్ద భక్తురాలు పోగొట్టుకున్న ఒక బంగారు గాజును టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది గుర్తించి తిరిగి అప్పగించారు.బెంగళూరుకు చెందిన వి.వెంకటేశ్ అనే భక్తుడు తన భార్యతో కలిసి సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం లడ్డూ కౌంటర్ల వద్ద బంగారు గాజును జారవిడుచుకున్నారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న హోమ్గార్డ్ నరేశ్ బంగారు గాజును గుర్తించి బయోమెట్రిక్ వద్ద అప్పగించారు.
ఒక గంట తరువాత పోగొట్టుకున్న భక్తులు లడ్డు కౌంటర్ వద్ద బంగారు గాజు కోసం వెతుకుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి తగిన గుర్తులను నిర్ధారించుకున్నాక 25 గ్రాముల బంగారు గాజును(సుమారు రూ.లక్ష) భక్తులకు అప్పగించారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించిన హోమ్గార్డ్ నరేశ్ను భద్రత అధికారులు అభినందించారు.