అమరావతి : కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లిన దంపతులిద్దరు మృతి చెందారు. నిన్న చేపల వేటకు వెళ్లిన వీరి తెప్ప ఈదురుగాలుల కారణంగా బోల్తా పడి గల్లంతయ్యారు. నిన్న గజ ఈతగాళ్ల సహాయంతో గాలించిన ఫలితం కనపించలేదు. ఈ రోజు కొంత దూరంలో దంపతుల మృతదేహాలు అక్కన్న, జయలక్ష్మి లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.