Petrol Price | హైదరాబాద్, జూలై 20 (నమస్తేతెలంగాణ): దేశంలో ఏపీలోనే పెట్రోల్ ధర అధికంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87 ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్పురి వెల్లడించారు. గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెట్రో ఉత్పత్తులపై దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదా? అని రాజస్థాన్ బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పన్ను ఆ ధారంగా ఆయా రాష్ర్టాల్లో పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తుల ధరలు ఉన్నాయని వివరించారు. జూలై 18 వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను మంత్రి పేర్కొన్నారు. దీన్నిబట్టి ఏపీ కంటే తెలంగాణలోనే పె ట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 109.66, డీజిల్ ధర రూ.97.82గా ఉన్నది. కేరళలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.73 కాగా, డీజిల్ ధర రూ.98.53గా ఉన్నది.