Tirumala | కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirupati Balaji Temple) దర్శించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan), జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
#WATCH | Telangana Governor & Puducherry LG Dr Tamilisai Soundararajan offered prayers at Tirupati Balaji Temple this morning pic.twitter.com/dKyF1F9fAA
— ANI (@ANI) January 1, 2024
భక్తుల రద్దీ
మరోవైపు నూతన సంవత్సరం నాడు తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో తిరుమల మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వెంకటేశ్వర నామస్మరణతో మార్మోగుతున్నాయి.
#WATCH | Jammu & Kashmir LG Manoj Sinha offered prayers at Tirupati Balaji Temple today morning pic.twitter.com/JRpdpyCXX5
— ANI (@ANI) January 1, 2024
Also Read..
David Warner | వన్డేలకూ వార్నర్ గుడ్ బై.. షాక్లో అభిమానులు
XPoSAT | ఎక్స్పోశాట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రో అరుదైన ఘనత
PM Modi | ఈ ఏడాది అందరికీ శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి: ప్రధాని మోదీ