న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పాత ఏడాదికి బైబై చెబుతూ.. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుభిక్షింగా ఉండాలని ఆకాంక్షించారు. ‘ప్రతి ఒక్కరికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.
Wishing everyone a splendid 2024! May this year bring forth prosperity, peace and wonderful health for all.
— Narendra Modi (@narendramodi) January 1, 2024