అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పోలింగ్(Polling) సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ(TDP) కోరింది. ఈ మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు కనకమేడల రవీంద్రకుమార్ (Ravindra Kumar) ఈసీకి లేఖ రాశారు. మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు
. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని మరో గంట పొడగించి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరపాలని ఆయన కోరారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు కలిపి ఎన్నికలు జరుగుతున్నందున తెలంగాణ (Telangana) లో పోలింగ్ సమయాన్ని పెంచిన విధంగా ఏపీలోనూ పెంచాలని కోరారు.
పల్నాడు (Palnadu) జిల్లా కొప్పునూరులో బుధవారం అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. తిరుపతి, ఎన్టీఆర్,నంద్యాల(Nandyal), నెల్లూరు , చిత్తూరు, ప్రకాశం, కడప, బాపట్ల, అనకాపల్లి, కర్నూలు, జిల్లాలో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుంది.