అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu ) మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం బీజేపీ అగ్రనాయకుల(BJP Leaders) తో ఆయన భేటి కానున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరిద్దరు కలిసి కేంద్రమంత్రి అమిత్షా(Amit Shah) ను కలువనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు.
బీజేపీ పెద్దల నుంచి పిలుపురావడం వల్లే తమ నాయకులు ఢిల్లీకి వెళుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందడడంతో ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా 175 అసెంబ్లీ సీట్లకు గాను 118 స్థానాల్లో టీడీపీ 94, జనసేన 24 స్థానాల కేటాయింపు చేసుకున్నారు వీటిలో 94 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను చంద్రబాబు డిక్లేర్ చేయగా జనసేన 5 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇంకా మిగిలిన 57 స్థానాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పంచుకోనున్నాయి.
గురువారం ఢిల్లీలో జరుగుతున్న భేటిలో పొత్తుల వ్యవహారం కొలికివచ్చే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేయనున్నది. ఇప్పటికే అభ్యర్థుల కసరత్తును పూర్తి చేసిన వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితాను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.