అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. నిన్న రాత్రి నుంచి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ ట్విట్టర్ ఖాతాలో వివిధ రకాల పోస్టులు పెట్టిన హ్యాకర్స్ పెట్టడాన్ని గమనించి ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని త్వరలో పునరుద్ధరణ అవుతుందని ఆయన తెలిపారు.