అమరావతి : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు వైరస్కు బారినపడ్డారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కొవిడ్ పాజిటివ్గా పరీక్షించారు. సోమవారం ఆయన తనయుడు నారా లోకేశ్ సైతం కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హోంక్వారంటైన్లో ఉన్నారు.
కరోనా పాజిటివ్గా పరీక్షించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైన త్వరగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని కోరారు. అందరు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేశారు.