అమరావతి : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూర్ జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్రెడ్డి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
సీఎంగా తన రికార్డును బ్రేక్ చేయడం ఎవరివల్లా కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అన్నారు.
అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో అడుగు పెట్టేందుకు జగన్ భయపడుతున్నారని అన్నారు.
పారాసిటమాల్ వేసుకుంటే కరోనా పోతుందన్న వ్యక్తి అదే కరోనాకు భయపడి తన పర్యటన రద్దు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ గల్లా జయదేవ్తోపాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి