Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులు సోమవారం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సున్నిపెంటకు హెలికాప్టర్లో వెళ్లారు. అక్కడ నుంచి కారు కాన్వాయ్ లో సాక్షి గణపతి ఆలయానికి చేరుకున్నారు.
సాక్షి గణపతి ఆలయం నుంచి శ్రీశైలం ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు దంపతులకు మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబు దంపతులు.. మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.