అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన హైకోర్టు న్యాయవాది అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కర్నూలు పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన హైకోర్టు లాయర్ వాల్మీకి వెంకటేశ్వర్లు మూడు రోజుల క్రితం తమ్ముని వద్దకు వెళ్లి తిరిగి వస్తూ కనిపించకుండా పోయాడు. మూడురోజులుగా అతడి కుటుంబ సభ్యులు అతడి ఆచూకి కోసం గాలించినా ఫలితం కానరాలేదు. మహానంది పోలీసు స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా ఇవాళ కర్నూలు శివారులోని పంట పొలం మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందివ్వడంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేశ్వర్లును హత్య చేసి రోడ్డు పక్కన పడేసి ఉంటారని కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.