హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, గజ్జల ఉమాశంకర్రెడ్డిలు తమ సహ నిందితుడు దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును వేర్వేరుగా ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఇదిలా ఉండగా అప్రూవర్గా మారిన దస్తగిరి కడప జిల్లా ఎస్పీని కలిశారు. తన గన్మెన్లను మార్చేశారని, తన ప్రాణాలకు హాని ఉందని ఫిర్యాదు చేశారు. తనకు ఏమి జరిగినా సీఎం జగన్దే బాధ్యత అన్నారు. కొన్ని పరిణామాలపై అనుమానంగా ఉందన్నారు. తనపై వైఎస్సార్సీపీ నేతలు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. గన్మెన్లను మార్చడమనేది పాలనా పరమైన అంశమని, దస్తగిరి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు.