Road | ఆ గ్రామానికి రోడ్డు లేదు.. దీంతో ఊరిలో నుంచి రాకపోకలు కొనసాగించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.. తమ సమస్యను పట్టించుకోవాలని గ్రామానికి రోడ్డు వేయాలంటూ అధికారులకు చాలా సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
చేసేదేమి లేక విద్యార్థులు బురద రోడ్డులో మోకాళ్లపై మోకరిల్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం, చాపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలపరిధిలోని ఎన్. ఓబాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి రోడ్డు వేయాలంటూ చాలా కాలంగా ప్రజలు, విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో సమస్యను పరిష్కరించండి సారూ.. అంటూ విద్యార్థులు మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ వేడుకున్నారు. వారితోపాటు మహిళలు కూడా బురదలో దిగి తమ నిరసన తెలియజేశారు.
Izonary ante mamuluga undadhu mari @ncbn @PawanKalyan https://t.co/KQDyC4Vxuw
— 🕉️MuraliTS (@kilari_muraliTS) March 3, 2026
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు