శ్రీశైలం : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీశైల దేవస్థానంలో కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ పీ కోటేశ్వర్రావు ఆలయ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీశైలంలోని భ్రమరాంభ అతిథిగృహంలో కొవిడ్ కట్టడి చర్యలపై దేవస్థానం అధికారులతో పాటు మెడికల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్నదనే విషయాన్ని మరవొద్దని సూచించారు. కొత్త వేరియంట్ విస్తరిస్తున్న క్రమంలో ఆలయంలో నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారన్న ఆయన.. వారంతా సామాజిక దూరం పాటించడం, తప్పనిసరిగా మాస్క్ ధరించేలా, చేతులు తరుచూ శుభ్రం చేసుకునేలా చూడాలన్నారు.
ఈ మేరకు అవగాహన కల్పించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరిగే వారికి రూ.100 జరిమానా విధించాలని ఆదేశించారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాల్లో మాస్క్లు ధరించని అనుమతించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలకు రూ.10వేల నుంచి రూ.25 వేల జరిమానా జరిమానా విధించాలన్నారు.
మాస్క్ ధరించకపోతే ఆలయంలో దర్శనానికి అనుమతి ఉందని, ఈ మేరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా దేవస్థానం మైక్ల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఫీవర్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మెడికల్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు. కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాంపిల్స్ సేకరణ వేగవంతం చేసి వెంటనే సేకరించిన ల్యాబ్లకు పంపాలన్నారు. సమావేశంలో ఈవో లవన్న, సిబ్బంది పాల్గొన్నారు.