అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న 76,148 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 39,208 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 5.43 కోట్లు హుండీ ఆదాయం వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వెల్లడించారు. వీరికి దర్శనానికి 7 గంటల సమయం పడుతుందని వివరించారు.