తిరుమల : వేసవి, వీకెండ్ సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల సంఖ్య పెరుగుతుంది. శుక్రవారం 71,119 మంది భక్తులు స్వామివారిని దర్శంచుకోగా శనివారం 83, 739 మంది దర్శించుకున్నారు. 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు 33 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారని, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తెలిపారు.